
న్యూఢిల్లీ: అప్పుల్లో కూరుకుపోయిన జైప్రకాష్ అసోసియేట్స్ను అదానీ గ్రూప్కొనుగోలు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మంగళవారం తెలిపింది. ప్రస్తుతం నడుస్తున్న దివాలా ప్రక్రియలో అదానీ గ్రూప్ బిడ్ గెలిస్తే ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుంది. నిబంధనల ప్రకారం జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్(జేఏఎల్)లో 100 శాతం వాటాలను అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్), అదానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఐడీపీఎల్) లేదా అదానీ గ్రూప్లోని ఏ ఇతర సంస్థ అయినా కొనుగోలు చేయొచ్చని సీసీఐ తెలిపింది.
సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం, రిజల్యూషన్ ప్లాన్ను సమర్పించడానికి సీసీఐ నుంచి అనుమతి తప్పనిసరి. జేఏఎల్ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్(సీఓసీ) రిజల్యూషన్ ప్లాన్లను సమీక్షిస్తోంది. త్వరలో ఓటింగ్ జరుగుతుంది. అదానీ గ్రూప్తో పాటు డాల్మియా భారత్ ప్రతిపాదనకు కూడా రెగ్యులేటర్ ఆమోదం తెలిపింది. వేదాంత గ్రూప్, జిందాల్ పవర్, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్తో సహా ఇతర కంపెనీలు సైతం తమ రిజల్యూషన్ ప్లాన్లను సమర్పించడానికి సీసీఐ ఆమోదం కోరాయి.