అదానీ ఎంటర్​ప్రైజస్​ అదుర్స్​..మయన్మార్​ పోర్టు అమ్మకం

అదానీ ఎంటర్​ప్రైజస్​ అదుర్స్​..మయన్మార్​ పోర్టు అమ్మకం

ముంబై: అదానీ గ్రూప్​ ఫ్లాగ్​షిప్​ కంపెనీ అదానీ ఎంటర్​ ప్రైజస్​ లిమిటెడ్​ క్యూ 4 రిజల్ట్స్​ అదరగొరట్టాయి. మార్చి 2023 క్వార్టర్లో కంపెనీ నికర లాభం డబులై రూ. 722.48 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది క్యూ 4 లో ఈ నికర లాభం రూ. 304.32 కోట్లే. తాజా మార్చి క్వార్టర్లో కంపెనీ రెవెన్యూ కూడా 26 శాతం పెరిగి రూ. 31,346 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది మార్చి క్వార్టర్లో అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​ రెవెన్యూ రూ. 24,866 కోట్లు. అదానీ ఎయిర్​పోర్ట్స్​ మార్చి 2023 క్వార్టర్లో 2.14 కోట్ల మంది ప్యాసింజర్లను హ్యాండిల్​ చేసింది. మార్చి 2022 క్వార్టర్​తో పోలిస్తే ఇది 74 శాతం ఎక్కువ. రోడ్లు, ఎయిర్​పోర్టుల బిజినెస్​లలో విస్తరణ వల్లే నికర లాభం రెట్టింపయిందని అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​ తెలిపింది. కంపెనీ​ మరోసారి తన పనితీరుతో సక్సెస్​ఫుల్​గా నిలబడిందని, ప్రపంచంలోని సక్సెస్​ఫుల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ఫౌండరీస్​లో ఒకటిగా మారిందని అదానీ గ్రూప్​ చైర్మన్​ గౌతమ్​ అదానీ చెప్పారు. షేర్​హోల్డర్లకు రూ. 1.20 చొప్పున డివిడెండ్​ను ఇచ్చేందుకు డైరెక్టర్ల బోర్డు అంగీకరించింది. ఆగస్టు 27, 2001 నుంచి మొత్తం 22 డివిడెండ్లను షేర్​హోల్డర్లకు  కంపెనీ ఇచ్చింది. అదానీ ఎంటర్​ప్రైజస్​ షేర్​ ప్రస్తుతం

 రూ. 1,925 వద్ద ట్రేడవుతోంది.. మయన్మార్​ పోర్టు అమ్మకం....

అదానీ గ్రూప్​లోని మరో కంపెనీ అదానీ పోర్ట్స్​ అండ్​ స్పెషల్​ ఎకనమిక్​ జోన్​ లిమిటెడ్​ (ఏపీ ఎస్​ఈజెడ్​) తన చేతిలోని మయన్మార్​ పోర్టును 30 మిలియన్​ డాలర్లకు అమ్మేసింది. కిందటేడాది మే నెలలోనే మయన్మార్​ పోర్టు విక్రయానికి  షేర్  ​పర్చేజ్​ అగ్రిమెంట్​ను ఏపీఎస్​ఈజెడ్​ కుదుర్చుకుంది. ఈ షేర్​ పర్చేజ్​ అగ్రిమెంట్​లో కొన్ని ప్రత్యేకమైన కండిషన్లు ఉన్నాయి. అవసరమైన అనుమతులు రావడంలో తీవ్ర జాప్యం జరుగుతుండటం వల్ల ఈ ప్రాజెక్టు ఛాలెంజ్​గా మారిందని ఏపీఎస్​ఈజెడ్​ ఒక స్టేట్​మెంట్లో తెలిపింది. ఇండిపెండెంట్​ వాల్యుయేషన్​ తర్వాత బయ్యర్​, సెల్లర్​ మధ్య ఒప్పందం కుదిరిందని, ఈ ఒప్పందం కింద 30 మిలియన్​ డాలర్లను మూడు వర్కింగ్​ డేస్​లో బయ్యర్​ చెల్లించాలని ఏపీఎస్​ఈజెడ్​ వెల్లడించింది. అక్టోబర్​ 2021లో తమ కంపెనీ రిస్క్​ కమిటీ రికమెండేషన్​కు అనుగుణంగానే మయన్మార్​ పోర్టు అమ్మకాన్ని చేపట్టినట్లు ఏపీఎస్​ఈజెడ్​ సీఈఓ కరణ్​ అదానీ వెల్లడించారు.