బీక్యూ ప్రైమ్​లో మిగిలిన 51 % కొంటున్న అదానీ

బీక్యూ ప్రైమ్​లో  మిగిలిన 51 % కొంటున్న అదానీ

న్యూఢిల్లీ: బీక్యూ  ప్రైమ్​​ డిజిటల్ ​బిజినెస్​ న్యూస్​ ప్లాట్​ఫామ్​​ను నడిపే క్వింటిలియాన్​బిజినెస్​ మీడియాలో మిగిలిన 51 శాతం వాటాను  రాఘవ్​  బహల్​ నుంచి అదానీ గ్రూప్​ కొనాలనుకుంటోంది. తన  మీడియా సబ్సిడరీ ఏఎంజీ మీడియా నెట్​వర్క్స్​ లిమిటెడ్ ​ క్వింటిలియాన్​ బిజినెస్​ మీడియాలో  మిగిలిన 51 శాతం వాటా కొనుగోలుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​ ఎక్స్చేంజీలకు తెలిపింది. 

బీక్యూ  ప్రైమ్ పేరుతో ఫైనాన్షియల్​ న్యూస్​ డిజిటల్ ​మీడియా ప్లాట్​ఫామ్​ను ఈ కంపెనీ నడుపుతోందని పేర్కొంది. క్వింటిలియాన్​లో వాటా కొనుగోలుతోనే అదానీ గ్రూప్​  మీడియా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాతే ఎన్​డీటీవీలో 65 శాతం వాటాను కిందటేడాది డిసెంబర్​లో కొనుగోలు చేసింది. క్వింటిలియాన్​లో 49 శాతం వాటాను రూ. 47.84 కోట్లకు గతంలోనే కొన్నది.