న్యూఢిల్లీ: బీక్యూ ప్రైమ్ డిజిటల్ బిజినెస్ న్యూస్ ప్లాట్ఫామ్ను నడిపే క్వింటిలియాన్బిజినెస్ మీడియాలో మిగిలిన 51 శాతం వాటాను రాఘవ్ బహల్ నుంచి అదానీ గ్రూప్ కొనాలనుకుంటోంది. తన మీడియా సబ్సిడరీ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్ క్వింటిలియాన్ బిజినెస్ మీడియాలో మిగిలిన 51 శాతం వాటా కొనుగోలుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అదానీ ఎంటర్ప్రైజస్ లిమిటెడ్ ఎక్స్చేంజీలకు తెలిపింది.
బీక్యూ ప్రైమ్ పేరుతో ఫైనాన్షియల్ న్యూస్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ను ఈ కంపెనీ నడుపుతోందని పేర్కొంది. క్వింటిలియాన్లో వాటా కొనుగోలుతోనే అదానీ గ్రూప్ మీడియా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాతే ఎన్డీటీవీలో 65 శాతం వాటాను కిందటేడాది డిసెంబర్లో కొనుగోలు చేసింది. క్వింటిలియాన్లో 49 శాతం వాటాను రూ. 47.84 కోట్లకు గతంలోనే కొన్నది.