
న్యూఢిల్లీ: తన గ్రూపుపై అంతర్జాతీయ సంస్థల విశ్వాసాన్ని పెంపొందించడానికి ఏసీసీ, అంబుజా సిమెంట్ల కొనుగోలు కోసం తీసుకున్న 3.5 బిలియన్ డాలర్ల అప్పును రీఫైనాన్స్ చేసినట్లు అదానీ సిమెంట్ శుక్రవారం తెలిపింది. 10 అంతర్జాతీయ బ్యాంకులు ఈ లోన్ను రీఫైనాన్స్ చేశాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రీ-ఫైనాన్సింగ్ కార్యక్రమం మూడు సంవత్సరాల వరకు లోన్ మెచ్యూరిటీతో ముగిసింది. గ్లోబల్ ఫైనాన్స్ మార్కెట్లో తమ సంస్థకు ఉన్న పరపతిని ఈ రీఫైనాన్స్ తెలియజేస్తోందని అదానీ ప్రకటించింది. ఈ రీఫైనాన్స్ వల్ల 300 మిలియన్ డాలర్ల ఖర్చు ఆదా అయిందని పేర్కొంది.
అదానీ సిమెంట్ గత సంవత్సరం సెప్టెంబర్లో అంబుజా ఏసీసీని 6.6 బిలియన్ డాలర్ల డీల్కు కొనుగోలు చేసింది. ఫలితంగా ఇది దేశంలో రెండవ అతిపెద్ద సిమెంట్ తయారీదారుగా ఎదిగింది. ప్రస్తుతం, అంబుజా సిమెంట్, ఏసీసీలకు సంవత్సరానికి 67 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. సంఘీ సిమెంట్ను కొనుగోలు చేయడంతో ఇది 2025 నాటికి100 మిలియన్ టన్నులకు చేరుకుంటుంది. రీఫైనాన్సింగ్కు డీబీఎస్ బ్యాంక్, ఫస్ట్ అబుదాబి బ్యాంక్, మిజుహో బ్యాంక్, ఎంయూఎఫ్జీ బ్యాంక్ ఈ లావాదేవీకి మాండేటెడ్ లీడ్ అరేంజర్స్, బుక్రన్నర్లు, అండర్ రైటర్లుగా వ్యవహరించాయి.