సికింద్రాబాద్, వెలుగు : సమ్మర్హాలిడేస్నేపథ్యంలో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకున్ని సికింద్రాబాద్రైల్వే స్టేషన్లో మరో ఐదు టికెట్కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి మామూలు రోజుల్లో 1.80 లక్షల మంది ప్రయాణికులు జర్నీ చేస్తుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 2.20 లక్షలకు చేరింది. క్యూఆర్కోడ్తో టికెట్లు కొనుగోలు చేసే వెలుసుబాటు ఉన్నప్పటికీ రద్దీ కొనసాగుతోంది. దీంతో రైల్వే అధికారులు అదనంగా ఐదు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు.