లోక్ సభలో ట్రంప్ కంపం…. మోడీ వివరణకు కాంగ్రెస్ పట్టు

లోక్ సభలో ట్రంప్ కంపం…. మోడీ వివరణకు కాంగ్రెస్ పట్టు

కశ్మీర్ అంశంలో ట్రంప్ వ్యాఖ్యలపై లోక్ సభలో రచ్చ కొనసాగుతోంది. ఇవాళ కూడా విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. ప్రధాని మోడీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ ఎంపీలు. కశ్మీర్ అంశంపై ఏమి మాట్లాడకపోతే ప్రధాని ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారని అధీర్ రంజన్ చౌదరి నిలదీశారు. ట్రంప్ అసత్యం చెప్పారని  మోడీ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. కశ్మీర్ విషయంలో ప్రభుత్వం క్లారిటీగా ఉందన్నారు పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. విదేశాంగ మంత్రి ప్రకటన చేసినా.. విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన కౌంటరిచ్చారు.