
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: విద్యార్థుల భవిష్యత్కు బలమైన పునాదులు వేసేందుకే జిల్లాలో ఆరోగ్య పాఠశాల, ఆరోగ్య కళాశాల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆదిలాబాద్కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం పట్టణంలోని రణదివే నగర్జడ్పీ హైస్కూల్లో రెండో విడత ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరు సూత్రాలపై రూపొందించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సంవత్సరం జిల్లాలో 251 స్కూళ్లు, కాలేజీల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, దీని ద్వారా విద్యార్థులకు శారీరక, మానసిక, ఆహార సంబంధిత ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తామన్నారు.
మొబైల్ వాడకంతో వచ్చే అనారోగ్య సమస్యల గురించి విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ఆలోచింపజేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్మించిన మరుగుదొడ్లు, సానిటరీ నాప్కిన్ మెషీన్ ను కలెక్టర్ప్రారంభించి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్, హెచ్ఎం లక్ష్మణ్, లీడ్బ్యాంక్మేనేజర్ రాంచందర్ రావు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గంగాసాగర్, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం
జైనథ్ మండల కేంద్రంలోని కేజీబీవీని కలెక్టర్రాజర్షి షా గురువారం తనిఖీ చేశారు. స్కూల్పరిసరాలు, కిచెన్ను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని ఆదేశించారు. స్టూడెంట్లతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.