ఆదిలాబాద్ టౌన్, వెలుగు: మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని ఆదిలాబాద్జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్లో ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాల సభ్యులకు నిర్వహించిన శిక్షణలో మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు డి.హనుమంత్ నాయక్తో కలిసి పాల్గొని సూచనలు చేశారు. నగదు, మద్యం, బహుమతుల పంపిణీపై నిరంతర నిఘా ఉంచాలని, ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు.
