కోల్బెల్ట్,వెలుగు: రంజాన్ పండుగను పురస్కరించుకొని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో బుధవారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లోని ఏజోన్ బిలాల్ మసీదులో తోఫా పంపిణీ జరిగింది.
పట్టణ ముస్లిమ్ మైనార్టీ వెల్ఫేర్ కమిటీ ప్రెసిడెంట్, సీనియర్ కాంగ్రెస్ నేత అబ్దుల్అజీజ్ ముస్లింలకు తోఫా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ సర్కార్, మంత్రి వివేక్ వెంకటస్వామి ముస్లింల సంక్షేమానికి కృషి కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. మసీదు సదర్ ఆరీఫ్,నూరూల్. ఆరీఫ్, ఖాజా షరీఫ్, ఖాజా భాయ్, ఇమ్రాన్,షబ్బీర్ పాల్గొన్నారు.
