ఆదిలాబాద్టౌన్, వెలుగు: పోలీస్అమరుల త్యాగాన్ని గుర్తించాలని, జిల్లాలో ప్రస్తుత ప్రశాంతతకు వారే కారణమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిలాబాద్పట్టణంలో నిర్వహించిన 5కె రన్ ను ఆయన ప్రారంభించారు.
ఇందిర ప్రియదర్శిని స్టేడియం నుంచి ప్రారంభమైన రన్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. దాదాపు 1,500 మంది యువత, పోలీసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎస్పీ స్వయంగా 5 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు. ఏఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీలు శ్రీనివాస్, జీవన్ రెడ్డి, ఇంద్రవర్ధన్, హసీబుల్ల, పట్టణ సీఐలు, ఎస్సైలు, విద్యార్థులు పాల్గొన్నారు.
పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి
బెల్లంపల్లి, వెలుగు: పోలీస్అమరుల త్యాగాలు మరువలేనివని బెల్లంపల్లి వన్టౌన్ఎస్హెచ్ వో శ్రీనివాసరావు అన్నారు. పోలీస్అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పోలీసు స్టేషన్లో ఓపెన్హౌస్నిర్వహించారు. పోలీసుల విధులు, కేసులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎస్సై రాకేశ్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
