క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నికల కోసం దాచిన మద్యం పట్టివేత

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నికల కోసం దాచిన మద్యం పట్టివేత
  •     ఇండిపెండెంట్ అభ్యర్థిపై కేసు  

కోల్​బెల్ట్, వెలుగు: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డుకు చెందిన అల్జా చంద్రయ్య ఇంట్లో రూ.96,228 విలువైన మద్యం బాటిల్స్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామకృష్ణాపూర్​ టౌన్ ​ఎస్సై జె.శ్రీధర్​ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం రాత్రి చంద్రయ్య ఇంట్లో తనిఖీలు నిర్వహించి మద్యం బాటిల్స్​ను గుర్తించారు.

మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు 10వ వార్డు నుంచి పోటీ చేస్తున్న ఇండిపెండెంట్​అభ్యర్థి గొల్లపల్లి మహేందర్​మద్యం బాటిల్స్​ను దాచినట్లు పోలీసులు నిర్ధారించారు. మద్యం స్వాధీనం చేసుకొని మహేందర్, చంద్రయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

బెల్ట్​షాప్​పై దాడి

మరోవైపు గద్దెరాగడి సాయికుటీర్ ప్రాంతంలో బొమ్మ మొగిలి నిర్వహిస్తున్న బెల్ట్​షాప్​పై దాడి చేసి రూ.2,254 విలువైన మద్యం బాటిల్స్​ను పట్టుకున్నామని, నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీధర్​ తెలిపారు. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం, నగదు పంపిణీ వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.