ఆదిలాబాద్ లో 160 బైక్​ల మోడిఫైడ్​ సైలెన్సర్ల ధ్వంసం..

ఆదిలాబాద్ లో 160 బైక్​ల మోడిఫైడ్​ సైలెన్సర్ల ధ్వంసం..
  • ప్రజలను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు: ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ ​మహాజన్​

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్​మహాజన్​ హెచ్చరించారు. నెల రోజుల పాటు నిర్వహించిన స్పెషల్​ డ్రైవ్​లో పట్టుబడిన 160 బైక్​ల మోడిఫైడ్​ సైలెన్సర్లను ఎస్పీ ఆధ్వర్యంలో  పోలీసులు 2 టౌన్ ​పోలీస్​స్టేషన్​ ముందు మంగళవారం రోడ్డు రోలర్​తో తొక్కించి  ధ్వంసం చేయించారు.  

ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు, యూత్  మోడిఫైడ్ సైలెన్సర్లను బిగించినా, భారీ సౌండ్స్​ వచ్చేలా ఏర్పాట్లు చేసినా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ –1989 కింద  కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బైక్​కు మోడిఫైడ్​సైలెన్సర్లను బిగించవద్దని మెకానిక్ లకు సూచించారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు సునీల్ కుమార్, కరుణాకర్ రావు, ప్రణయ్ కుమార్, ఎస్ఐలు మహేందర్, దేవేందర్, ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు.