రిలీజ్కు ముందే రూ.500 కోట్లు.. ఇది కదా అసలైన క్రేజ్ అంటే!

రిలీజ్కు ముందే రూ.500 కోట్లు.. ఇది కదా అసలైన క్రేజ్ అంటే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) రాముడిగా చేస్తున్న ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఆదిపురుష్(Adipurush). భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్ కు ముందే ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ వచ్చేశాయట. రిలీజ్ కు ముందే మేకర్స్ రూ.500 కోట్లు తమ ఖాతాలో వేసుకోవడం విశేషం. దీంతో ఈ సినిమా మేకర్స్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టనుంది.

కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ హక్కుల ద్వారానే రూ.155 కోట్లు వచ్చాయి. ఈ విషయంలో టాలీవుడ్ లో ఆదిపురుష్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక దేశవ్యాప్తంగా హక్కుల ద్వారా మరో రూ.120 కోట్లు వచ్చాయి. ఇక ఓటీటీ హక్కులు, శాటిలైట్ హక్కుల కింద మరో రూ.210 కోట్లు రావడంతో.. ప్రొడ్యూసర్లు సేఫ్ సైడ్ ఉన్నారు.

ఇక రిలీజ్ తరువాత కలెక్షన్లు కూడా భారీగానే వచ్చే అవకాశం ఉంది. మొదటి షో నుండి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం.. రూ.1000 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా. అయితే రిలీజ్ కు ముందే భారీగా సంపాదించినా.. డిస్ట్రిబ్యూటర్లు భవితవ్యం మాత్రం సినిమా టాక్ పైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాకు ఉన్న హైప్ తో భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. దీంతో ఈ సినిమా మొదటిరోజు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు రూ.100 కొట్లు కొల్లగొట్టే అవకాశం ఉంది. మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేయనుంది అనేది తేలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.