
ప్రభాస్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ‘ఆదిపురుష్’ టీమ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టుగానే.. అక్టోబర్ 2న అయోధ్యలో టీజర్ను విడుదల చేయనున్నట్టు కన్ఫర్మ్ చేసింది. రామాయణం ఆధారంగా ఓం రౌత్ తీస్తున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీ సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి. అయితే ఇంతవరకు ప్రభాస్ ఫస్ట్ లుక్ని కూడా రిలీజ్ చేయకపోవడం ఫ్యాన్స్ని డిజప్పాయింట్ చేసింది. ఇప్పటికి వారి ఆశ నెరవేరుతోంది. ప్రభాస్ లుక్, టీజర్ ఒకేసారి రివీల్ కానున్నాయి.