మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ ని అడ్డుకున్న గ్రామస్థులు

మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ ని అడ్డుకున్న గ్రామస్థులు

మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ ని అడ్డుకొని ఆయనకు చుక్కలు చూపించారు అద్రాస్ పల్లి  గ్రామస్థులు. ముడుచింతలపల్లి మండలంలోని అద్రాస్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్లగూడెంలో రోడ్లు, స్ట్రీట్ లైట్స్ సరిగా లేవని గ్రామ సర్పంచ్ కి తమ బాధలను చెప్పుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కనీసం మత్రికైనా తమ బాధలను చెప్పుకుందామని మంత్రి పర్యటనలో భాగంగా అద్రాస్ పల్లి గ్రామం నుండి వెళ్తుండగా.. కాన్వాయిని అడ్డుకుని ఆయనను గల్లి గల్లి తిప్పి తమ తిప్పలు చుడండి అంటూ వాపోయారు. 

దాదాపు గంటపాటు మంత్రి మల్లారెడ్డిని అద్రాస్ పల్లి, ఎల్లగూడెం గ్రామాలకు తీసుకెళ్లి రోడ్లు, వీధి దీపలు లేవంటూ.. అదేవిధంగా కరెంట్ వైరలు కూడా చేతికి తాకేంత కిందికి వేలాడుతున్నాయని సమస్యలను వెంటనే పరిష్కారించాలని గ్రామస్థలు కోరారు. ఈ సమస్యపై మంత్రి స్పందించి విద్యుత్ అధికారిని పిలిపించి కరెంట్ సమస్యలను గ్రామస్థుల నుండి తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని సూచించారు.