
వికారాబాద్, వెలుగు: న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. గురువారం వికారాబాద్ లో నిర్వహించిన బార్అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరై, మాట్లాడారు. వికారాబాద్ కోర్టు సముదాయం పక్కన గల ఇరిగేషన్ ఆఫీస్స్థలాన్ని కోర్టులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. వారం, పది రోజుల్లో కొత్త భవన నిర్మాణానికి ఫౌండేషన్వేసేలా చూస్తానని పేర్కొన్నారు.
అవసరమైతే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డిని తీసుకువస్తానని చెప్పారు. జిల్లాలోని జూనియర్ న్యాయవాదులకు ఎక్కువ స్టైఫండ్ వచ్చేలా, న్యాయవాదులకు ఇండ్ల స్థలాలు పంపిణీపై కలెక్టర్తో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. అంతకుముందు డాక్టర్ అనిల్ కుమార్ పాటిల్, డాక్టర్ అశ్విని పాటిల్ దంపతులు ఏర్పాటు చేసిన ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ డెంటల్హాస్పిటల్ను స్పీకర్ ప్రారంభించారు.
వికారాబాద్ ప్రజలకు సేవా దృక్పథంతో తక్కువ వ్యయంలో దంత వైద్య సేవలందించాలని సూచించారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ఎన్.బస్వరాజ్, ప్రధాన కార్యదర్శి వెంకట్రెడ్డి, ఉపాధ్యక్షుడు శంకరయ్య, సీనియర్న్యాయవాదులు గోవర్ధన్రెడ్డి, యాదవరెడ్డి, సంపూర్ణ ఆనంద్, శుభప్రద్ పటేల్, నాగరాజు, వసుంధర, ఆనంద్తదితరులున్నారు.