ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్లు హైరిస్క్ కేటగిరిలో ఉంటారు. వాళ్లకే వ్యాక్సిన్ ఎక్కువ అవసరం. కానీ మన దేశంలో కొవిడ్ వ్యాక్సిన్పై పూర్తి స్థాయిలో ట్రయల్స్ జరగలేదు. కాబట్టి వాళ్లకు మినహాయింపు ఇచ్చారు. యూకే, కొన్ని దేశాల్లో గర్బిణీలకు కూడా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఆ దేశాల్లో జరిగిన స్టడీస్లో సేఫ్టీ ఎక్కువగానే ఉన్నట్లు తేలింది. కానీ, మన దేశంలో ఇవ్వట్లేదు. గర్భవతులపై ట్రయల్స్ చేసి, స్టడీ చేసిన తర్వాత అనుమతించే సరికి లేట్ అవుతుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాల్సిందే. ఈ టైమ్లో ప్రెగ్నెన్సీని ఆపడం మంచిది అనుకుంటే ఓసీ (ఓరల్ కాంట్రసెప్టివ్) పిల్స్ వాడొచ్చు. కానీ వ్యాక్సిన్ తీసుకునే టైమ్లో మాత్రం ఓసీ పిల్స్ వాడకూడదు. ప్రెగ్నెన్సీని ఆపడానికి దంపతులు ఆల్టర్నేటివ్ పద్ధతుల్ని పాటించాలి.
మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్
పీరియడ్ టైంలో ఓవర్ బ్లీడింగ్, పీసీఓడీ ప్రాబ్లమ్స్తో బాధపడేవాళ్లు మెడిసిన్స్ వాడుతుంటారు. వ్యాక్సిన్ తీసుకునే టైంలో ఆ మెడిసిన్స్ తీసుకోవడం ఆపాలి. పిల్లల కోసం మెడిసిన్స్ వాడేవాళ్లు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మెడిసిన్స్ ఆపాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మగవాళ్లలో స్పెర్మ్ కౌంట్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కొన్ని వారాలకు మళ్లీ నార్మల్ అవుతుంది.
తల్లిపాలలో యాంటిబాడీస్
డెలివరీ తర్వాత కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బిడ్డకు పాలివ్వొచ్చు. ఆ పాలలో కూడా యాంటీ బాడీస్ ఉన్నట్లు గుర్తించారు. ఆ పాలు పడితే బిడ్డలో కూడా కరోనాని ఎదుర్కొనే కెపాసిటీ పెరుగుతుంది.
- డా. వజ్రాల కావ్య ప్రియ,
ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్
