వెజ్ కు బదులు నాన్ వెజ్.. కంప్లైంట్ చేసినా నో యూజ్

వెజ్ కు బదులు నాన్ వెజ్.. కంప్లైంట్ చేసినా నో యూజ్

అహ్మదాబాద్‌లోని ఒక ఆందోళనకరమైన సంఘటన చోటుచేసుకుంది. మెక్సికన్ హాట్ పాట్‌కు ప్రసిద్ధి చెందిన బోపాల్‌లోని టొమాటోస్ & మిర్చ్ మసాలా వారి క్యారీ ఆన్ రెస్టారెంట్ ఓ కుటుంబానికి శాకాహారానికి బదులు చికెన్ ముక్కలను సర్వ్ చేసింది. ఇది ఆ కుటుంబాన్ని తీవ్ర నిరాశను కలిగించింది. దీనికి పరిష్కారం కోరుతూ, వారు మేనేజర్‌ను సంప్రదించారు. కాని వారి ఆందోళన బూడిదలో పోసిన పన్నేరే అయింది.

దీంతో విసుగు చెందిన ఆ కుటుంబం.. ఈ సంఘటన వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. శాఖాహారం, మాంసాహారం విభాగాల విభజనను ధృవీకరించడానికి వంటగదిని సందర్శించడంతోపాటు సిబ్బందితో వారి ఘర్షణను ఈ వీడియో క్యాప్చర్ చేసింది. బిల్లు ఆర్డర్‌ను 'వెజ్ మెక్సికన్ హాట్ పాట్' అని కూడా సూచించింది. వారు అక్కడితో ఆగకుండా.. అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కు ఫిర్యాదు చేయడం ద్వారా విషయాన్ని తీవ్రతరం చేసింది. ఈ ఆందోళనకరమైన సంఘటన గురించి తెలుసుకున్న AMC ఆరోగ్య విభాగం.. రూ.10వేల జరిమానా విధించింది.  

సనంద్ నివాసి మీట్ రావల్ ప్రకారం, వారు మొదట్లో శాకాహారమైన మెక్సికన్ హాట్ పాట్‌ను ఆర్డర్ చేశారు. ఆ తర్వాత డెలివరీని అందుకున్న వారు భోజనం చేస్తుండగా.. మాంసం ముక్కలను కనుగొన్నారు. “మేము దాని గురించి ఫిర్యాదు చేశాము, కానీ రెస్టారెంట్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కావున మేము సంఘటన వీడియోను చిత్రీకరించాం. దాన్ని సోషల్ మీడియాలో ప్రసారం చేశాం. AMC కి కూడా ఫిర్యాదు చేశాం అని రావల్ తెలిపారు.