
గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 133మంది ప్రయాణికులు చనిపోయారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. గురువారం(జూన్12) మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన్ ఎయిర్ ఇండియా విమానంలో ఐదు నిమిషాల్లోనే ఎయిర్ పోర్టు సమీపంలోని కాలనీలో కూలిపోయింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రమాదంలో విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. వారిలో 232 మంది ప్రయాణికులు, 10 విమాన సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో 163 మంది భారతీయులు, 53మంది బ్రిటీష్ జాతీయులు,1కెనడియన్, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు ఉన్నారు.
అహ్మదాబాద్ లో విమానాశ్రయం మూసివేత
ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయిన తర్వాత అహ్మదాబాద్ ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఎయిర్ పోర్టు మూసివేయబడుతుందని SVPIA ప్రతినిధి తెలిపారు. ఈ సంఘటన తర్వాత అత్యవసర,రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడతాయని SVPIA ప్రతినిధి తెలిపారు.
Also Read : అహ్మదాబాద్ విమాన ప్రమాదం..133మంది ప్రయాణికులు మృతి
ప్రమాదం గురించి, మృతులు, ఇతర వివరాలకు 011-24610843 , 9650391859 నంబర్లను జారీ చేసింది DGCA. ఎయిర్ ఇండియా కూడా హెల్ప్లైన్ నంబర్ఏ ర్పాటు చేసింది. అదనపు సమాచారం అందించడానికి ఎయిర్ ఇండియా 1800 5691 444 ప్రత్యేక ప్రయాణీకుల హాట్లైన్ నంబర్ను ఏర్పాటు చేసింది.
Ahmedabad City Police emergency number for police emergency services and information regarding the Ahmedabad plane crash.
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) June 12, 2025
07925620359#AhmedabadPlaneCrash#PlaneCrash#AhmedabadCityPolice#Emergency pic.twitter.com/QH9pJmCY3M