లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న అహోబిలం పీఠాధిపతి

లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న అహోబిలం పీఠాధిపతి

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని అహోబిలం పీఠాధిపతి  రంగనాథ యతీంద్ర మహాదేశికన్​  దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వేద ఆశీర్వచనం తర్వాత స్వామివారి తీర్థప్రసాదాలను దేవాదాయ కమిషనర్, ఆలయ అధికారులు పీఠాధిపతికి అందజేశారు. దర్శనం అనంతరం భక్తులకు మంగళ శాసనములను అహోబిలం పీఠాధిపతి అందజేశారు.