నైతికంగా ఇండియా కూటమి గెలిచింది: ఖర్గే

నైతికంగా ఇండియా కూటమి గెలిచింది: ఖర్గే



ఎన్నికల ఫలితాల వస్తున్న వేళ కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రెస్​ మీట్​ నిర్వహించారు.  232 స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధించిందని ఖర్గే అన్నారు.  ఈ ఎన్నికల్లో నైతికంగా ఇండియా కూటమి విజయం సాధించిందని మల్లిఖార్జున ఖర్గే అన్నారు.  ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అంటూ.. 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదన్నారు.  ప్రస్తుతం భారతదేశ ప్రజలు మోదీని వ్యతిరేకించినట్టు భావిస్తున్నామని ఖర్గే అన్నారు.ఎన్నికల సమయంలో బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా విజయం సాధించామన్నారు.  ఈ తీర్పు మోదీకి నైతిక ఓటమి అన్నారు. రాహుల్​ గాంధీ పోటీ చేసిన రెండు స్థానాల్లో గెలిచారన్న ఆయన... రాహుల్​ జోడో యాత్రకు బీజేపీ ఎన్నో అడ్డంకులు సృష్టించిందన్నారు.  ప్రజా తీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నామన్నారు. 

2024 ఎన్నికలు మోదీ వర్శెస్​ ప్రజలు అన్న రీతిలో జరిగాయన్నారు.  రాహుల్​ యాత్రలు కాంగ్రెస్​ పార్టీకి ఎంతో మైలేజ్​ తెచ్చాయన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికార గర్వంతో ఎన్నో వ్యవస్థలను ధ్వంసం చేసిందన్నారు.  ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్​ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు.