బీఆర్ఎస్పై ప్రజల్లో వ్యతిరేకత : ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్

బీఆర్ఎస్పై ప్రజల్లో వ్యతిరేకత : ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్
  • ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పై  ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో రుజువైందని ఏఐసీసీ సెక్రటరీ సంపత్​కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం గాంధీ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు కోసం మూడు నెలలు కాంగ్రెస్ క్యాడర్ కష్టపడిందని తెలిపారు. 

ప్రభుత్వ పనితీరు, సీఎం రేవంత్ రెడ్డి వ్యూహంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలిచామని చెప్పారు.  సీఎం, పీసీసీ చీఫ్ మహేశ్​ గౌడ్ నాయకత్వం తో కాంగ్రెస్ పార్టీకి  ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నదని స్పష్టమైందన్నారు.