- 40 కిలోల కాపర్ కాయిల్స్ రూ.5.5 లక్షల క్యాష్ స్వాధీనం
నిజామాబాద్, వెలుగు: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నిజామాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. పది మంది ముఠాలో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని 40 కిలోల కాపర్కాయిల్స్, రూ.5.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సీపీ సాయిచైతన్య మీడియాకు వివరాలు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన తంబారె సుధాకర్ఆధ్వర్యంలో యూపీకి చెందిన హరిబల్ శర్మ, వలీ, ఏపీకి చెందిన యడాల వెంకటేశ్వర్లు, మేడ్చల్వాసి అనిల్, డిచ్పల్లికి చెందిన అలీ మహ్మద్, మహబూబ్నగర్కు చెందిన శానంపల్లి రవీందర్, మెదక్వాసి లింగప్ప, సిద్దిపేటకు చెందిన గాజుల శ్రీశైలం, హైదరాబాద్కు చెందిన మహ్మద్హైదర్ అలీ ముఠాగా ఏర్పడ్డారు.
వ్యవసాయ బావుల వద్ద ట్రాన్స్ ఫారాల్లోని కాపర్కాయిల్స్చోరీ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 101 ట్రాన్స్ఫార్మర్లను ఎత్తుకెళ్లగా 44 కేసులు నమోదు అయ్యాయి. ఇందల్ వాయి మండలం గన్నారం వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులకు వీరు పట్టుబడ్డారు. అనిల్, వలీ తప్ప మిగతా ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
