కాంగ్రెస్లో ఉండే టీఆర్ఎస్తో కొట్లాడుతడు

కాంగ్రెస్లో ఉండే టీఆర్ఎస్తో కొట్లాడుతడు

పార్టీని వీడుతానని సంకేతాలివ్వడంతో కాంగ్రెస్ నేతలు రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజగోపాల్ రెడ్డి కరుడుగట్టిన కాంగ్రెస్వాది అని ఆయన పార్టీని వీడే ప్రసక్తేలేదని అన్నారు. ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయడని, ఉప ఎన్నిక వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను రాజగోపాల్ని రెగ్యులర్ గా కలుస్తామని చెప్పారు.

టీఆర్ఎస్తో కొట్లాడేది కాంగ్రెస్ మాత్రమేనని వంశీచంద్ రెడ్డి అన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండే టీఆర్ఎస్ తో కొట్లాడుతారని స్పష్టం చేశారు. బండి సంజయ్ చెప్పేవన్నీ ఉత్తి మాటలేనన్న  వంశీచంద్.. ఇందుకు హైదరాబాద్ వరదల సమయంలో వచ్చినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడనున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన ఓ బహిరంగ లేఖ విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.