ఎల్ఏసీ వద్ద భారీ విన్యాసాలకు సిద్ధమైన ఎయిర్​ఫోర్స్​

ఎల్ఏసీ వద్ద భారీ విన్యాసాలకు సిద్ధమైన ఎయిర్​ఫోర్స్​

న్యూఢిల్లీ: బార్డర్​లో చైనా కవ్వింపు చర్యల నేపథ్యంలో మన ఎయిర్​ఫోర్స్​ అలర్ట్​ అయ్యింది. ఈశాన్య భారతంలోని లైన్​ ఆఫ్​ యాక్చువల్​ కంట్రోల్(ఎల్ఏసీ) వద్ద భారీ విన్యాసాలకు సిద్ధమైంది. ఇక్కడి ప్రధాన ఎయిర్ ​బేస్​లన్నీ ఈ ఎక్సర్​సైజ్​లో పాల్గొంటాయని అధికారులు వెల్లడించారు. వచ్చే నెల మొదట్లో ఈ ఎక్సర్​సైజ్​ జరుగుతుందన్నారు. అలాగే 400 కిలోమీటర్ల దూరంలోని శత్రువుల ఎయిర్​క్రాఫ్ట్​లను, మిస్సైల్స్​ను గుర్తించే సామర్థ్యం కలిగిన ఎస్–400 ఎయిర్ డిఫెన్స్​ స్క్వాడ్రాన్​ను కూడా ఇప్పుడు పరీక్షించనున్నారు. విన్యాసాల్లో భాగంగా ఎయిర్​ఫోర్స్​కు సంబంధించి యుద్ధ సమయాల్లో ఉపయోగపడే రాఫెల్, సుఖోయ్ సు–30 ఫైటర్లతో పాటు ట్రాన్స్​పోర్ట్, ఇతర విమానాలను టెస్ట్ చేస్తారు.

డ్రోన్​ స్క్వాడ్రాన్​కూడా ఇందులో పాలుపంచుకుంటుందని అధికారులు తెలిపారు. సిక్కిం, సిలిగురి సెక్టార్​లో శత్రువుల కదలికలను కనిపెట్టేందుకు ఈ స్క్వాడ్రాన్​ ఉపయోగపడుతుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఎక్సర్​సైజ్​లను మనదేశం నిర్వహించడం ఇది రెండోసారి. చైనా ఇటీవల కాలంలో సరిహద్దుల వద్ద సైన్యాన్ని భారీగా పెంచింది. డోక్లాం వద్ద యాక్టివిటీస్​ను పెంచింది. ఇక్కడ చైనా కదలికలపై మన సెక్యూరిటీ ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. షిల్లాంగ్‌‌లోని ఐఏఎఫ్​ఈస్టర్న్​ కమాండ్ ఈశాన్యంలోని చైనా సరిహద్దు వెంబడి గగనతలాన్ని పరిరక్షిస్తుంది. చైనా ఫ్లైట్లు, ఫైటర్​ జెట్లు ఎల్ఏసీకి దగ్గరగా రావడానికి ప్రయత్నించినా.. లేదా అక్కడి ఇండియన్​ క్యాంపుల దిశలో వెళ్లడానికి యత్నించినా తన ఫైటర్లు తరచు అడ్డుకుంటున్నారు.