ఎయిర్ ఇండియా ప్రమాదం: బతికిన ఒకే ఒక్కడితో ప్రధాని మోదీ ముచ్చట

ఎయిర్ ఇండియా ప్రమాదం: బతికిన ఒకే ఒక్కడితో ప్రధాని మోదీ ముచ్చట

ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు ప్రధాని మోదీ. శుక్రవారం (జూన్ 13) అహ్మదాబాద్ కు వెళ్లిన ప్రధాని.. విమానం కూలిన ప్రాంతాన్ని విజిట్ చేశారు. మెడికల్ విద్యార్థుల హాస్టల్ పై విమానం కూలడంతో.. ఆ ప్రాంతానికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

అహ్మదాబాద్ లోని సివిల్ హాస్పిటల్ C7 వార్డులో  చికిత్స పొందుతున్న 25 మంది క్షతగాత్రులను ప్రధాని మోదీ పరామర్శించారు. అదే విధంగా ఈ ప్రమాదంలో బతికిన ఏకైక వ్యక్తి రమేష్ విశ్వకుమార్ బుచర్వాడాను ప్రధాని మోదీ కలిశారు. అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో మొత్తం 10 నిమిషాలు ప్రధాని ఉన్నారు. 

ఆ తర్వాత ప్రమాదం గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రధాని. అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో గుజ్ సెయిల్ ఆఫీసులో పౌర విమానయాన అధికారులతో చర్చించారు. ఘటనకు గల కారణాలను, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 

గుజరాత్‏లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‎లోని సర్ధార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని మేఘాని ప్రాంతంలో చెట్టును ఢీకొని ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 సిబ్బంది మొత్తం 242 మందితో గురువారం (జూన్ 12) మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది. 

ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే విమానాశ్రయం సమీపంలోని చెట్టును ఢీకొని జనవాసాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం అంటే 241 మంది చనిపోయారు.  పైలెట్లు, విమాన సిబ్బంది, ప్రయాణికులు అంతా సజీవ దహనమయ్యారు. అయితే మెడికల్ కాజేసీ హాస్టల్ పై పడటంతో మరింత మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో ప్యాపెసంజర్లతో పాటు కలిపి మొత్తం 297 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.