ఎయిర్ ఇండియా తమ ప్యాసింజర్ల కోసం స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ రూట్లలో 96 గంటల ప్రత్యేక సేల్ను ప్రారంభించింది. ప్రయాణిలకు ఆకర్షణీయమైన ఛార్జీలతో టూర్ ప్లాన్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
హైదరాబాద్ నుంచి బెంగళూరుతో పాటు ఇతర దేశీయ మార్గాల్లో విమాన టిక్కెట్ల ఛార్జీలను తగ్గించింది ఎయిర్ ఇండియా. ఎకానమీ క్లాస్ కు రూ.1470, బిజినెస్ క్లాస్కు రూ.10,130 (అన్నీ ఛార్జీలు కలిపి )నుండి ప్రారంభమవుతాయి. ఎంపిక చేసిన దేశీయ, అంతర్జాతీయ రూట్లలో సెప్టెంబర్ 1నుంచి అక్టోబర్ 31 మధ్య ప్రయాణానికి 2023 ఆగస్టు 20 సేల్ బుకింగ్లు తెరిచి ఉంటాయి.
హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు ఇప్పుడు కేవలం రూ.1931 ఛార్జీతో ప్రయాణించవచ్చు. హైదరాబాద్ నుంచి ముంబైకి విమాన ఛార్జీ రూ.1541కి తగ్గగా.. హైదరాబాద్ నుంచి ఢిల్లీ రూట్లో రూ.4856కి పడిపోయింది. ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా సర్వీస్ ఛార్జ్ లేకుండా బుకింగ్ చేసుకోవచ్చు. వెబ్సైట్,మొబైల్ యాప్తో పాటు నేరుగా అధీకృత ట్రావెల్ ఏజెంట్లు,ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్ల (OTAలు) ద్వారా కూడా విక్రయం కింద బుకింగ్లు చేసుకోవచ్చు.