డ్యూటీ అయిపోయింద‌ని విమానం న‌డ‌ప‌న‌న్న పైలెట్... ఆ తర్వాతేమైందంటే

డ్యూటీ అయిపోయింద‌ని విమానం న‌డ‌ప‌న‌న్న పైలెట్... ఆ తర్వాతేమైందంటే

ఢిల్లీకి వెళ్లే ఎయిరిండియా విమానానికి ఊహించని అంతరాయం ఏర్పడంతో ముగ్గురు బీజేపీ ఎంపీలతో సహా 100 మంది ప్రయాణికులు గుజరాత్‌లోని రాజ్‌కోట్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఈ సంఘటన జూలై 23న జరిగగా.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) నిబంధనల ప్రకారం విమాన పైలట్ తన డ్యూటీ అయిపోయిందని, విమానాన్ని నడిపేందుకు నిరాకరించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది, దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

జూలై 23న రాత్రి 8.30 గంటలకు టేకాఫ్ కావాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విమానంలోని ప్రయాణీకుల్లో ముగ్గురు రాజకీయ నాయకులు ఉన్నారు. వారిలో రాజ్‌కోట్ ఎంపీ మోహన్ కుందారియా, జామ్‌నగర్ ఎంపీ పూనమ్ మాదం, కొత్తగా ఎన్నికైన రాజ్యసభ ఎంపీ కేసరిదేవ్‌సింగ్ ఝాలా ఉన్నారు. జూలై 23 సాయంత్రం రాజ్‌కోట్ - ఢిల్లీ మధ్య నడిచే AI404 కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయిందని ఈ సందర్భంగా విమానయాన సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. " కాక్‌పిట్ సిబ్బంది ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్ (FDTL) నిబంధనల పైలట్ కిందకు వచ్చారు. రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం ఆయన విమానాన్ని నడపలేరు. FDTL నియంత్రణ అనేది చర్చించలేని అంశం, ఈ విషయంలో రాజీచేయలేం" అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.

"అత్యవసర ప్రాతిపదికన ఢిల్లీకి చేరుకోవాల్సిన కొంతమంది ప్రయాణికులను రోడ్డు మార్గంలో అహ్మదాబాద్‌కు పంపించారు. మిగిలిన ప్రయాణికులకు అన్ని భోజనాలతో పాటు హోటల్ వసతిని అందించారు. వారి కోరిక మేరకు ఫ్లైట్ టైమింగ్స్ కూడా రీషెడ్యూల్ చేశారు" అని ప్రతినిధి తెలిపారు.

ఈ నెల ప్రారంభంలోనూ ఇదే రకమైన సంఘటన చోటుచేసుకుంది. సాంకేతిక సమస్య కారణంగా జూలై 2న వాంకోవర్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI 186 క్యాన్సిల్ చేయడంతో దాదాపు 20 నుంచి 25 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. బ్రిటీష్ కొలంబియా విశ్వవిద్యాలయం (UBC) విద్యార్థులు తమ కష్టాలను వివరిస్తూ, జూలై 2న ఉదయం 10.15 గంటలకు వాంకోవర్ విమానాశ్రయం నుంచి విమానం మొదట బయలుదేరాల్సి ఉందని, అయితే రెండుసార్లు రీషెడ్యూల్ చేశారని, చివరికి రద్దు చేశారని పేర్కొన్నారు.