అయోధ్యకు రూ.1622కే విమాన టికెట్

అయోధ్యకు రూ.1622కే విమాన టికెట్

 న్యూఢిల్లీ :  అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ స్పెషల్ సేల్ ప్రకటించింది. ఎంపిక చేసిన డొమెస్టిక్, ఇంటర్నేషనల్, డైరెక్ట్ వన్-వే విమానాల్లో  అయోధ్యకు రూ.1,622కే టికెట్ అందిస్తున్నట్లు వెల్లడించింది. స్పైస్ మ్యాక్స్, యూఫస్ట్ వంటి యాడ్-ఆన్‌‌లపై గరిష్టంగా 30% తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. ఎం-–సైట్, మొబైల్ యాప్, వెబ్ సైట్, రిజర్వేషన్ కౌంటర్లు, ప్రత్యేక ట్రావెల్ ఏజెంట్ల వద్ద బుక్ చేసుకునే అన్ని టికెట్లపై ఈ ఆఫర్ ఉంటుంది.