క్రిస్మస్కు ఇంకో వారం రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే అన్ని చోట్లా కేక్ మిక్సింగ్లు చేసేస్తున్నరు. ఇళ్లలో క్రిస్మస్ చెట్లు నాటేస్తున్నరు. శాంటా నాకేం గిఫ్ట్ ఇస్తవ్ అని పిల్లలు అడిగేస్తున్నరు. అయితే, కొన్ని చోట్ల కొంచెం వెరైటీగా కానిచ్చేస్తున్నరు కొందరు. ఓ ఎయిర్పోర్టోళ్లు కత్తెర్లు, బుల్లెట్లతో సరికొత్త క్రిస్మస్ ట్రీని పెడితే, ఒకామె నల్లోళ్ల కోసం సెపరేట్గా బ్లాక్ శాంటా యాప్ను స్టార్ట్ చేసింది. ఎక్కడికైనా వెళితే చాలా మంది అవసరమున్నవి లేనివి అన్నింటిని బ్యాగులో కుక్కేసి లగేజీలో తీసుకెళుతుంటరు. అయితే, ఎయిర్పోర్టులో స్కానింగ్లు ఎక్కువ కదా. అనుమతి లేని వస్తువులేవైనా కనిపిస్తే వెంటనే అధికారులు లాగేసుకుంటరు. ఇదిగో, అలా గుంజుకున్న కత్తెర్లు, బుల్లెట్లు, బ్లేడ్లు, కత్తులతో కొత్త క్రిస్మస్ ట్రీని లిథువేనియాలోని విల్నియస్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసింది. అంతేకాదు, లైటర్లు, పండ్లు, కూరగాయల తొక్క తీసే పీలర్లనూ అందులో పెట్టింది. తమ క్రిస్మస్ చెట్టు మాస్టర్పీస్ అంటున్నరు ఆ ఎయిర్పోర్టు అధికారులు.
ఇప్పటిదాకా కొత్తగా, సహజంగా, అందంగా పెట్టుకున్న క్రిస్మస్ ట్రీలను చూసి ఉంటారు గానీ, తాము పెట్టినటువంటి చెట్టును మాత్రం చూసి ఉండరని గ్యారంటీ ఇస్తం అంటున్నరు. ఎయిర్పోర్టు అధికారుల క్రియేటివిటీ చూసి నెట్టింట జనం మస్తు ఖుషీ అయితున్నరు. ఇది ఇట్లుంటే అమెరికాలోని టెక్సస్కు చెందిన ఒకామె బ్లాక్ శాంటా కోసం ఓ యాప్నే తయారు చేసింది. తన పిల్లల కోసం బ్లాక్ శాంటాను ఏళ్లకొద్దీ వెతికి వెతికి విసిగిపోయిన జిహాన్ వుడ్స్ అనే ఆమె, ‘ఫైండ్ బ్లాక్ శాంటా’ పేరుతో యాప్ను తయారు చేసింది. గత ఏడాది అక్టోబర్లో ఆ యాప్ తయారీకి అయ్యే ఖర్చు కోసం దాతలను వెతికింది. నెల రోజుల్లోనే 5 వేల డాలర్లను (సుమారు రూ.3.5 లక్షలు) సమీకరించింది. శాంటాలు జనాలకు తగ్గ రంగుంటే పిల్లల్లో పాజిటివ్నెస్ పెరుగుతుందని, అందుకే ఇట్ల చేసిన అని సైకియాట్రిస్ట్ అయిన ఆమె చెబుతోంది.