
న్యూఢిల్లీ: టెలికాం ఫ్రాడ్లు, స్కామ్లను అరికట్టడంలో తమతో చేతులు కలపాలని రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాకు ఎయిర్టెల్ లెటర్స్ పంపింది. ఈ విషయాన్ని ప్రభుత్వం, రెగ్యులేటర్ ట్రాయ్కు తెలియజేసింది. అన్ని టెలికాం కంపెనీలు కలిసి పనిచేసి, మోసపూరిత స్కామ్లను ఎదుర్కోవాలని ఎయిర్టెల్ కోరింది.
కిందటేడాది మొదటి 9 నెలల్లో ఇండియాలో 17 లక్షల సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ నమోదయ్యాయని, రూ.11 వేల కోట్లకు పైగా ఆర్థిక నష్టం జరిగిందని జియో, వొడాఫోన్కి రాసిన లెటర్స్లో పేర్కొంది. సైబర్ క్రిమినల్స్ ఫిషింగ్ లింక్స్, ఫేక్ లోన్ ఆఫర్స్, ఫ్రాడ్ పేమెంట్ పేజీలు వంటి విధానాలను వాడి, యూజర్లను మోసం చేస్తున్నారు. ఎయిర్టెల్ డిజిటల్ స్పామ్లు, స్కామ్లను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. మోసాలను అరికట్టేందుకు కొత్త ఫీచర్ను తెచ్చింది.