రష్మిక కన్నా నాకే బాగా సెట్ అయ్యేది: ఐశ్వర్య రాజేష్

రష్మిక కన్నా నాకే బాగా సెట్ అయ్యేది: ఐశ్వర్య రాజేష్

నటి ఐశ్వర్య రాజేష్ క్రేజీ కామెంట్స్ చేసింది. పుష్ప సినిమాలో శ్రీవల్లి క్యారెక్టర్ తనకైతే బాగా సెట్ అయ్యేదని చెప్పి అందరికీ షాకిచ్చింది. ఆమె తాజాగా నటించిన మూవీ "ఫర్హాన". ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన తరువాతి సినిమా గురించి అలాగే తెలుగు సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది ఐశ్వర్య.

‘‘తెలుగు ఇండస్ట్రీ అంటే తనకెంతో ఇష్టం అని చెప్పిన ఐశ్వర్య.. తెలుగులో సినిమా చేస్తే తప్పకుండా అది నా కుటుంబం గర్వపడే ప్రాజెక్ట్‌ అయి ఉండాలని అనుకునేదాన్నిని చెప్పుకొచ్చింది. అలా, ఎన్నో ఏళ్లు ఎదురుచూశాక ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో నటించే అవకాశం వచ్చిందన్న ఆమె.. అది నన్ను తెలుగువారికి దగ్గర చేసిందని పేర్కొంది. ఆ తర్వాత ‘టక్‌ జగదీశ్‌’, ‘రిపబ్లిక్‌’ వంటి సినిమాల్లో అవకాశం వచ్చినా.. మంచి పాత్రలతో కమ్‌ బ్యాక్‌ ఇవ్వాలని ఉందని తన మనసులో మాటని బయటపెట్టింది.

ఇక ప్రస్తుతానికి తెలుగులో ఏ ప్రాజెక్ట్‌ ఓకే చేయడంలేదని చెప్పిన ఆమె.. ‘పుష్ప’లో రష్మిక బాగా చేసిందని, కానీ ఆ రోల్‌ నాకు బాగా సెట్‌ అవుతుందని నా నమ్మకం అని చెప్పి అందరికీ షాకిచ్చింది. అలాగే.. ప్రేక్షకులను అలరించే పాత్ర ఏదైనా సరే దుమ్ము దులిపేయడమే’’ అని ఐశ్వర్య చెప్పింది. ప్రస్తుతం ఐశ్వర్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.