న్యూఢిల్లీ: రవాణా సేవలకు డిజిటల్ పేమెంట్లను వాడుతున్న మెగాసిటీల్లో హైదరాబాద్లో మొదటిస్థానంలో నిలిచింది. మిగతా సిటీలన్నింటికంటే ఇక్కడే డిజిటల్ పేమెంట్ల చెల్లింపు ఎక్కువగా ఉందని ‘ఈజ్ ఆఫ్ మూవింగ్ ఇండెక్స్ ఇండియా రిపోర్ట్’ తెలిపింది. దీనిని ఓఎంఐ ఫౌండేషన్ విడుదల చేసింది. తరువాతిస్థానంలో కోల్కతా ఉంది. చిన్న నగరాల్లో ఐజ్వాల్ మొదటిస్థానంలో ఉంది. షిమ్లా, కోహిమా నగరాల్లోనూ మొబిలిటీకి, డెలివరీలకు డిజిటల్ పేమెంట్లను విరివిగా వాడుతున్నారు.
చాలా నగరాల్లో స్మార్ట్ఫోన్ యూజర్లు రవాణా, డెలివరీల కోసం మూడుకుపైగా యాప్స్ వాడుతున్నారు. ఈ రిపోర్ట్ కోసం 18 నగరాలకు చెందిన 50,488 మంది నుంచి అభిప్రాయాలను తీసుకున్నామని ఓఎంఐ తెలిపింది. ‘బూమింగ్ సిటీస్’ కేటగిరీలో కన్పూర్, పట్నా, లక్నోలు డిజిటల్ చెల్లింపుల్లో ముందజంలో ఉన్నాయి. నాగపూర్ నుంచి సర్వేలో పాల్గొన్న వారిలో మెజారిటీ యూజర్లు మూడు కంటే ఎక్కువ యాప్స్వాడుతున్నట్టు వెల్లడించారు.
ఎలక్ట్రిక్ వెహికల్స్ మారటం ఇష్టమని అహ్మదాబాద్లో ఎక్కువ మంది చెప్పారు. లూధియానాలో మహిళలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు ఈ స్టడీ తేల్చింది. ఈవీల వాడకం విషయంలో ఐజ్వాల్ మొదటిస్థానంలో నిలిచింది.