
అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ ఈ ఇయర్ బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ అఖిల్తో పాటు ప్రొడ్యూసర్స్కు షాక్ ఇచ్చింది. రూ.80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ కనీసం పది కోట్ల కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. ఓవరాల్గా ఈ సినిమాకి థియేట్రికల్ రన్ ద్వారా 13.50 కోట్ల గ్రాస్ రాగా, ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల షేర్ వచ్చిందని సమాచారం.
అయితే ఈ సినిమాకు 36 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో నిర్మాతలకు ముప్పై కోట్లకుపైగా నష్టాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు తెలుగు నిర్మాతలకు అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా ఏజెంట్ నిలిచింది.
ఇదిలా ఉండగా.. థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ సినిమా మే 19న సోని లివ్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాకి వచ్చిన డిజాస్టర్ టాక్ కారణంగా.. రిలీజైన ఇరవై రోజులకే ఓటీటీలోకి రాబోతుంది ఏజెంట్. ఇక ఈ సినిమా తరువాత అఖిల్ మరో పాన్ ఇండియా మూవీ చేస్తన్నాడు. భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవి క్రియేషన్స్ నిర్మిస్తోంది.