అక్షయ్ కుమార్ హీరోగా ‘కాంచన’ రిమేక్

అక్షయ్ కుమార్ హీరోగా ‘కాంచన’ రిమేక్

లారెన్స్ హీరోగా తెరకెక్కిన కాంచన సినిమాను హిందీ లో రిమేక్ చేస్తున్నారు. ఇందులో హీరోగా అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘లక్ష్మీ బాంబ్’ అనే టైటిల్ ఫైనల్ అయింది. అక్షయ్ కు జతగా.. కియారా అడ్వాని నటిస్తుంది. ఈ సినిమాకు రాఘవా లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. 5th జూన్ 2020న సినిమా విడుదల అవనుందని తెలిపారు లారెన్స్.

‘లక్ష్మీ బాంబ్’ ఫస్ట్ లుక్ ను తన ట్విటర్ ఎకౌంట్ లో షేర్ చేశారు అక్షయ్ కుమార్. ఇందులో కళ్లకు కాటుక పెట్టుకుంటు ఉంటాడు అక్షయ్. ప్రేక్షకుల వద్దకు బాంబ్ లాంటి సినిమాను తీసుకవస్తున్నట్లు ట్వీట్ చేశాడు. ఈ సినిమాను ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ప్రెజెంట్ చేస్తున్నట్లు తెలిపాడు అక్షయ్.