అకాల వర్షాలపై రైతులను అప్రమత్తం చేయండి : మంత్రి తుమ్మల

అకాల వర్షాలపై రైతులను అప్రమత్తం చేయండి :  మంత్రి తుమ్మల

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో అకాల వర్షాల నేపథ్యంలో అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వాతావరణ మార్పులతో రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురిసి పంట నష్టం జరిగినట్టు తెలిసిందని మంత్రి తెలిపారు. వచ్చే రెండు మూడు రోజుల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిందని చెప్పారు.

 రాష్ట్రంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాల ని కోరారు. అధికారులు రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. మార్కెట్ కు వచ్చిన ధాన్యం, మిర్చి పంటలు దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మార్కెటింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు.