పది ఫలితాల్లో అల్ఫోర్స్ జయకేతనం

పది ఫలితాల్లో అల్ఫోర్స్ జయకేతనం

కొత్తపల్లి : పదో తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు 135 మంది10 జీపీఏ సాధించి రాష్ట్రస్థాయిలో జయకేతనం ఎగరేసినట్లు ఆ స్కూల్ చైర్మన్ నరేందర్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం వావిలాలపల్లి అల్ఫోర్స్ ట్రైనిటాట్స్ స్కూల్​లో నిర్వహించిన అభినందన సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 139 మంది విద్యార్థులు 9.8 జీపీఏ, 113 మంది 9.7 జీపీఏ,  747 మంది 9 జీపీఏ ఆపై మార్కులు సాధించారని వివరించారు. 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు బొకేలు అందజేసి అభినందించారు.