రేపు ప్రధానితో త్రివిధ దళాధిపతుల భేటీ

రేపు ప్రధానితో త్రివిధ దళాధిపతుల భేటీ

‘అగ్నిపథ్’పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతులు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో  మంగళవారం (జూన్ 21న) భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అగ్నిపథ్ స్కీమ్ పై వారు ప్రధాని మోడీకి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారని పేర్కొంటూ ఓ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. త్రివిధ దళాలకు తేజస్సును అద్దే ప్రయత్నాల్లో భాగంగానే అగ్నిపథ్ స్కీమ్ కు శ్రీకారం చుట్టామని ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో త్రివిధ దళాలు తెలిపాయి. దాని అమలు విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశాయి. అగ్నిపథ్ పథకం ద్వారా భర్తీ అయ్యే అగ్ని వీర్లకు సైనికులతో సమానమైన ప్రయోజనాలు లభిస్తాయని పేర్కొన్నాయి.  ఆర్మీలో ఇకపై కేవలం అగ్నిపథ్ ద్వారానే సైనికుల నియామకాలు జరుగుతాయని తేల్చి చెప్పారు.