బస్సులన్నీ కేసీఆర్‌‌ సభకు.. ప్రయాణికుల తిప్పలు

బస్సులన్నీ కేసీఆర్‌‌ సభకు.. ప్రయాణికుల తిప్పలు

గోదావరిఖని, వెలుగు: మంచిర్యాలలో శుక్రవారం జరిగిన కేసీఆర్‌‌ సభకు జనాన్ని తరలించేందుకు గోదావరిఖని డిపో నుంచి 50 బస్సులను ఏర్పాటు చేశారు. దీంతో దూర ప్రాంతాలైన కరీంనగర్‌‌, భూపాలపల్లి, మంథనితో పాటు హైదరాబాద్‌‌కు వెళ్లేవారు బస్సులు లేక బస్టాండ్‌లోనే అవస్థలు పడ్డారు. 

బస్సులు వస్తాయా రావా అనే విషయాలను కూడా చెప్పేవారు లేకపోవడంతో ప్రయాణికులకు బస్టాండ్‌లోనే ఎదురుచూశారు.