
న్యూఢిల్లీ: అన్ని పాసింజర్ ఫ్లైట్లను మే 3వ తేదీ వరకూ రద్దు చేస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించారు. దేశంలో లాక్డౌన్ను మే 3 వరకూ పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మే 3 రాత్రి 11.59 నిమిషాల వరకూ అన్ని డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్టు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. మే 3 తర్వాత డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ల రాకపోకలపై ఆంక్షలను ఎత్తేసే విషయాన్ని పరిశీలిస్తామని ఆ శాఖ మంత్రి హర్దీప్ సింగ్పూరి ట్విట్టర్లో పేర్కొన్నారు. మంచి కారణంతో లాక్డౌన్ను పొడిగించారని, ఆ తర్వాతే ఆంక్షలను ఎత్తేయడంపై ఆలోచిస్తామని, ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారు అప్పటివరకూ ఓపిక పట్టాలని ఆయన కోరారు. లాక్డౌన్ కారణంగా ఏవియేషన్ సెక్టార్పై తీవ్రమైన ప్రభావం పడింది. రెవెన్యూ లేకపోవడంతో కొన్ని కంపెనీలు ఉద్యోగులకు శాలరీలు తగ్గించగా.. మరికొన్ని కంపెనీలు కొందరిని జాబ్ నుంచి తొలగించాయి.