- హైటెక్స్ లో ప్రారంభించనున్న సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు : బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) నిర్వహించే ఆలిండియా బిల్డర్స్ కన్వెన్షన్ 31వ సదస్సు (ఏఐబీసీ) 2024 హైదరాబాద్ వేదికగా జరగనుంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ హాల్ నెంబర్ 2 లో ఈ నెల 27వ తేదీ నుంచి 29 వరకు జరుగనుంది. ఈ కన్వెన్షన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించనున్నారని బీఏఐ జాతీయ అధ్యక్షులు ఎస్.యన్. రెడ్డి, బీఏఐ మాజీ జాతీయ అధ్యక్షులు బొల్లినేని శీనయ్య, రాష్ట్ర అధ్యక్షులు కె.దేవేందర్ రెడ్డిలు వివరించారు. అతిధులుగా రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు హాజరవుతున్నారని వివరించారు. 800 వందల మందికి పైగా విజిటర్స్ వస్తారని అంచనా.