![ఎన్నికల్లో బీసీలకు 52 సీట్లు ఇస్తం: ఏఐఎఫ్బీ](https://static.v6velugu.com/uploads/2023/10/all-india-forward-bloc-election-committee-chairman-katakam-mrityunjayam-said-that-52-seats-will-be-allotted-to-bcs_a67sHYtdnU.jpg)
హైదరాబాద్, వెలుగు: త్వరలో జరిగే ఎన్నికల్లో బీసీలకు 52 సీట్లను కేటాయిస్తామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(ఏఐఎఫ్బీ) ఎన్నికల కమిటీ చైర్మన్ కటకం మృత్యుంజయం తెలిపారు. రాష్ట్రాన్ని పదేండ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ అనేక హామీలు ఇచ్చిందని, కానీ వాటిని అమలు చేయలేదని ఆరోపించారు.
ఆదివారం హైదరాబాద్లోని ఏఐఎఫ్బీ ఆఫీసులో కాంగ్రెస్, బీఎస్పీ నుంచి పలువురు నేతలు మృత్యుంజయం సమక్షంలో ఫార్వర్డ్ బ్లాక్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాల్లో 31 రిజర్వుడ్ సీట్లని, మిగిలిన 88 సీట్లలో 60శాతానికి పైగా స్థానాలను బీసీలకే ఇస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాదని, సంకీర్ణ సర్కారు ఏర్పాటయ్యే అవకాశముందని తెలిపారు. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన భాగస్వామిగా మారబోతోందన్నారు.