పాక్ ప్రతిపాదనలన్నీ బూటకమే :కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ ఫైర్

పాక్ ప్రతిపాదనలన్నీ బూటకమే :కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ ఫైర్

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ పాకిస్తాన్​ను పాముతో పోల్చారు. ఎంపీల అఖిలపక్ష బృందంలో సభ్యుడిగా ఆయన  కోపెన్‌హాగన్‌ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి భారతీయులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. “పాకిస్తాన్ ప్రభుత్వానికి  చిత్తశుద్ధిలేదు. అలాంటి ప్రభుత్వంతో చర్చలు ఎలా జరపడం? అక్కడి ప్రభుత్వానికి విషపూరితమైన నాలుక ఉంది.

దానివల్ల ఎవరికి నష్టం? ఏ పాము కూడా తన విషంతో తాను చనిపోదు. అయినాసరే, కీలకమైన అంశాలపై చర్చలు జరిపేందుకు సిద్ధమని చెప్పే నైతిక ధైర్యం మాకుంది. అదే సమయంలో కాలయాపన చేసే ఉద్దేశంతో చర్చలను సాకుగా వాడుకుందామంటే మాత్రం మా టైం వేస్ట్ చేసుకోలేం. ఆ సమయాన్ని పాక్​ మరో ఉగ్రదాడికి ప్లాన్  చేయడానికి ఉపయోగిస్తుంది. చర్చల కోసం పాక్ చేసే ప్రతిపాదనలన్నీ 
బూటకమే” అని ఎంజే. అక్బర్ మండిపడ్డారు.