
ఛత్తీస్గఢ్లో 30 మంది మహిళలతో నక్సల్స్ వ్యతిరేక కమాండో యూనిట్ను ఏర్పాటు చేశారు అధికారులు. ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన బస్తర్, దంతెవాడలలో నియమించారు. ఈ కమాండోకు ‘దంతేశ్వరి ఫైటర్స్’ అని పేరు పెట్టారు. కమాండో యూనిట్ను మొత్తం మహిళలతో ఏర్పాటు చేయడం ఇది మొదటి సారి. ఈ కమాండోకు DSP దినేశ్వరి నంద్ నేతృత్వం వహిస్తున్నారు.
గతేడాది బస్తర్ లోని CRPF ఈ ప్రాంతంలో నక్సలైట్ల ఆగడాలను అరికట్టేందుకు కొంత మంది యువకులతో ప్రత్యేకంగా టీం ను ఏర్పాటు చేశారు. ‘బస్తరియా బెటాలియన్’ పేరుతో ఆ కమాండ్ యూనిట్ ను ఏర్పాటు చేశారు. ఆ టీంలో యువతులు, బాలికలను నియమించారు. వారు ఇప్పటికే ట్రైనింగ్ ను పూర్తి చేసుకున్నారు.