అల్లం నారాయణ సతీమణి మృతి 

అల్లం నారాయణ సతీమణి మృతి 

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ కన్నుమూశారు. కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పద్మ మరణంపై సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అల్లం నారాయణను ఫోన్లో పరామర్శించిన ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో అల్లం పద్మ సేవలను గుర్తు చేశారు. ఆమె గత 24 ఏళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో పోరాడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో 20 రోజుల క్రితం నిమ్స్లో అడ్మిట్ చేశారు. డాక్టర్ల ప్రయత్నాలు ఫలించకపోవడంతో కన్నుమూశారు. అమ్మల సంఘం అధ్యక్షురాలుగా ఉన్న పద్మ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జూబ్లీహిల్స్  మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

For more news..

తెలంగాణ సమాజం నిన్ను చూసి నవ్వుతోంది కేసీఆర్

రాష్ట్రంలో కేసీఆర్ పనైపోయింది : బండి సంజయ్