తెలంగాణ సమాజం నిన్ను చూసి నవ్వుతోంది కేసీఆర్

 తెలంగాణ సమాజం నిన్ను చూసి నవ్వుతోంది కేసీఆర్
  • మాజీ మంత్రి, బీజేపీ నేత బాబు మోహన్

సంగారెడ్డి జిల్లా:  కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉద్దరించింది ఏమి లేదు కానీ...దేశ రాజకీయాల్లోకి పోయి దేశాన్ని ఉద్దరిస్తాడంట అని మాజీ మంత్రి, బీజేపీ నేత బాబు మోహన్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం రాలేదని, ఉద్యోగుల్లో కూడా నిరుత్సాహం కనిపిస్తోందన్నారు. మంగళవారం  రాయికోడ్ మండలం పిప్పడ్ పల్లి గ్రామంలో బీజేపీ జెండాను సినీనటుడు, మాజీమంత్రి, బీజేపీ నేత బాబు మోహన్ ఆవిష్కరించారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరీష్ రావు, కేసీఆర్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ బంగారం కావడం.. సస్యశామలం కావడం  కాదు అంత శూన్యం అని విమర్శించారు. భూ కబ్జాలు కేసీఆర్ కు కనిపించడం లేదా ? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ లోకం మిమ్మలిని చూసి నవ్వుతుంది కేసీఆర్, మిమ్మలిని ఆ భగవంతుడే చూసుకుంటాడు, రాబోయే రోజుల్లో ఓటర్లు నిన్ను మట్టి కరిపిస్తారని బాబు మోహన్ జోస్యం చెప్పారు. 

 

 

ఇవి కూడా చదవండి

రాష్ట్ర  ప్రభుత్వంతో యుద్ధం చేసి ఉద్యోగాలు సాధించాలి

ప్రజల కష్టార్జితాన్ని కాంట్రాక్టర్లకు కట్టబెడుతుండు

మధ్యప్రదేశ్లో ‘తెలుగు వెలుగు’