బీఆర్ఎస్​ను ఓడించేందుకే కాంగ్రెస్‌‌‌‌తో పొత్తు : సీపీఐ నేత నారాయణ

బీఆర్ఎస్​ను ఓడించేందుకే కాంగ్రెస్‌‌‌‌తో పొత్తు : సీపీఐ నేత నారాయణ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో  కాంగ్రెస్ గెలుపునకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ప్రజలకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విజ్ఞప్తి చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌‌‌‌తో పొత్తుపెట్టుకున్నట్లు వెల్లడించారు. శనివారం ఆయన హైదరాబాద్​లో జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశంలో పాల్గొని, మాట్లాడారు. కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థుల గెలుపునకు సీపీఐ నేతలు, శ్రేణులు కృషి చేయాలని నారాయణ పిలుపునిచ్చారు.

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల కోసం రాష్ట్రస్థాయిలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్తగూడెంలో కూనంనేని సాంబశివ రావు గెలుపునకు కాంగ్రెస్‌‌‌‌ పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు కృషి చేయాలని కోరారు. కాగా.. ప్రజాయుద్ధనౌక గద్దర్ కూతురు, కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెల సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. సీపీఐ నేతలు నారాయణ, అజీజ్ పాషా, వెంకట్ రెడ్డిని కలిసి తన గెలుపునకు కృషి చేయాలని కోరారు.