కైకాల మరణం తీరని లోటు : అల్లు అరవింద్

కైకాల మరణం తీరని లోటు : అల్లు అరవింద్

కైకాల సత్యనారాయణ మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఆయనతో తమ కుటుంబానికి మంచి బంధం ఉందన్నారు. కైకాల చాలా మంచి వ్యక్తి అని.. చిన్నా, పెద్ద అని చూడకుండా అందరితో కలివిడిగా ఉండేవారని తెలిపారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని అరవింద్ కోరుకున్నారు.

కైకాల అంత్యక్రియలు ఇవాళ పూర్తయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో నవరస నటసార్వభౌముడికి తుది వీడ్కోలు పలికారు. అంతకుముందు ఫిల్మ్‌నగర్‌లోని ఆయన ఇంటి నుంచి జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. కైకాలకు తుది వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు తరలివచ్చారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల.. శుక్రవారం కన్నుమూశారు.