అతని వైఫల్యాన్ని చిరంజీవి గారికి ఆపాదించడం కరక్ట్ కాదు: అల్లు అరవింద్

అతని వైఫల్యాన్ని చిరంజీవి గారికి ఆపాదించడం కరక్ట్ కాదు: అల్లు అరవింద్

ప్రముఖ టాలీవుడ్ జర్నలిస్ట్ సురేష్ కొండేటి(Suresh Kondeti) గత కొన్నేళ్ల సంతోషం సినిమా అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ వేడుకలను నిర్వహించాలనుకున్నారు. ఇందుకోసం గోవాలో ఘనంగా ఏర్పాట్లు కూడా చేశారు. అయితే.. అక్కడ జరిగిన ఈ ఈవెంట్ లో కొన్ని సమస్యలు తలెత్తాయి. దానివల్ల కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయంలో కన్నడ ఇండస్ట్రీ చెందిన పలువురు ప్రముఖులు టాలీవుడ్ ఇండస్ట్రీని నిందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాదు.. కొన్ని మీడియా సంస్థలు ఈ వివాదంలో చిరంజీవిని కావాలనే లాగుతూ వార్తలు రాస్తున్నారు. ఆ అవార్డు ఫంక్షన్ నిర్వహించిన జర్నలిస్ట్ సురేష్ కొండేటి చిరంజీవి పిఆర్ఓ అని చెప్తూ కాంట్రవర్సీ క్రియేట్ అయ్యేలా రాస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై ప్రముఖ నిర్మాత, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వివాదం గురించి ఆయన మాట్లాడుతూ.. ఆ జర్నలిస్ట్ ఎప్పుడైనా మెగా ఫ్యామిలీ హీరోలకు పిఆర్ఓ అని చెప్పాడా? మా ఫ్యామిలీలోని హీరోలతో ఫోటోలు దిగినంత మాత్రాన పిఆర్ఓ అయ్యిపోతాడా? అవార్డుల ఫంక్షన్ నిర్వహించడం అనేది ఆ జర్నలిస్ట్ వ్యక్తిగత విషయం. అందులో లోపాలు జరిగితే దాన్ని మొత్తం ఇండస్ట్రీకి లేదా ఒక వ్యక్తికీ ఆపాదించడం అనేది సరైన పద్ధతి కాదు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అల్లు అరవింద్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.