పుష్ప మేకర్స్ పార్టీలో.. ఫన్నీ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్.. వీడియో వైరల్

పుష్ప మేకర్స్ పార్టీలో.. ఫన్నీ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్.. వీడియో వైరల్

69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో( National Awards) ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్(Allu Arjun), బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ అందుకున్న విషయం తెలిసిందే. కాగా నిన్న (అక్టోబర్ 21 న) జాతీయ అవార్డు విజేత‌ల‌కు మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ పార్టీలో అల్లు అర్జున్ మాట్లాడుతూ..' జాతీయ అవార్డులు వచ్చిన విషయం తెలియగానే..నాన్న(అల్లు అరవింద్) హ్యాపీ గా ఫీల్ అయ్యారని తెలిపారు. అంతేకాకుండా..నేను, దేవి జాతీయ అవార్డు అందుకున్నాక..నా ఇద్దరు కొడుకులకు నేషనల్ అవార్డు వచ్చినట్లు అనిపిస్తోందని మా నాన్న చెప్పారని వెల్లడించారు.

అప్పుడు అల్లు అర్జున్ నవ్వుతూ..స్కూల్లో సర్టిఫికెట్ కూడా తీసుకొని వాళ్లము మేము..భారత ప్రెసిడెంట్ చేతుల మీదుగా నేషనల్ అవార్డు తీసుకుంటామని అసలు అనుకోలేదని తెలిపారు. అలాగే,  ఫ్రెండ్స్ గా ఉన్న మేము (బన్నీ,DSP) చెన్నైలో పోరంబోకులుగా ప్రెసిడెంట్ దగ్గర మెడల్ తీసుకుంటాం అనుకున్నావా మరి అంటూ చమత్కరించారు.?..ఇంతటి గొప్ప లైఫ్ ఇచ్చిన మీకు..థ్యాంక్యూ డాడ్ అంటూ పేర్కోన్నారు. 

భారతీయ సినిమాకు వందేళ్ల చరిత్ర ఉండగా.. అందులో తెలుగు సినిమాకు 90 ఏళ్ల చరిత్ర కలిగి ఉండటం మన ప్రత్యేకత. మన టాలీవుడ్ నుంచి ఎందరో స్టార్స్ వచ్చారు. మరెందరో తమ స్థానాలను ఇండస్ట్రీలో పదిల పరుచుకున్నారు. కానీ ఏ నటుడికి ఉత్తమ జాతీయ అవార్డ్ రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.  సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప: ది రైజ్‌' మూవీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన బన్నీకి ఉత్తమ నటుడి విభాగంలో జాతీయ అవార్డును గెలుచుకున్న తొలి తెలుగు హీరో కావడం విశేషం.